కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన SDPI నాయకులు
నంద్యాల జిల్లాలోని కలెక్టర్ రాజకుమారికి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(SDPI) నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ లోగోలు, బోర్డులు, పేరు ఫలకాలు, పత్ర వ్యవహారాల్లో తెలుగు, ఆంగ్లంతో పాటు ఉర్దూను కూడా వినియోగించాలని కలెక్టర్ని వారు కోరారు. ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తించినా, దాని అమలులో లోపాలున్నాయని అధ్యక్షులు మణిహారం హనీఫ్ పేర్కొన్నారు.