VIDEO: పీఎస్లో విద్యార్థినులకు అవగాహన
CTR: తవణంపల్లి పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ స్కూల్ విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై డాక్టర్ నాయక్ విద్యార్థినులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. చదువుపై శ్రద్ధ పెట్టాలని, మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. సైబర్ నేరాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నియమాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు.