నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జేసీ
KKD: పెద్దాపురం పట్టణంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు. స్వచ్ఛ సంకల్పాన్ని పటిష్ఠంగా అమలు చేస్తూ, వీధులను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.