కాలువ గండ్లను పూడ్చిన తెలుగు యువత అధ్యక్షుడు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దేవుని చెరువు కట్టు కాలువకు గండ్లు పడ్డాయి. దీంతో చెరువులోని నీరు యాదవుల బజారులోని ఇళ్ల వైపు ప్రవహించడం ప్రారంభించింది. ఈ సమస్యను వెంటనే గుర్తించిన తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్, గురువారం జేసీబీ సహాయంతో కట్టు కాలువ గండ్లను పూడ్చివేశారు.