'ఎన్జీవోస్'ను ప్రభుత్వం గుర్తించాలి'
E.G: నిబద్ధతగా పనిచేసే సేవా సంస్థలపై చిన్నచూపు తగదని.. ప్రభుత్వం తమను గుర్తించాలని ఎన్జీవోలు కోరారు. రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఎన్జీవో ఐ.కుమార్ అధ్యక్షతన ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వర్ణాంధ్ర సంస్థ నిర్వాహకులు గుబ్బల రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 36 ఎన్జీవో సంస్థలు పాల్గొన్నాయి.