జిల్లాలో పోలింగ్ శాతం వివరాలు@9AM
KMR: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా పరిధిలోని 8 మండలాల్లో 142 సర్పంచ్ స్థానాలకు, 1,020 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 21.49% పోలింగ్ నమోదైందని తెలిపారు.