యోగాంధ్రకు కోటి మందికిపైగా రిజిస్ట్రేషన్‌

యోగాంధ్రకు కోటి మందికిపైగా రిజిస్ట్రేషన్‌

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యోగాంధ్రలో కోటి మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని యోగాంధ్ర నోడల్ అధికారి కృష్ణబాబు తెలిపారు. జూన్ 21 నాటికి ప్రభుత్వం నిర్దేశించుకున్న 2 కోట్లకు పైగా పేర్ల నమోదు లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్ల నమోదు 408 శాతం కాగా.. శిక్షకుల నమోదు 113 శాతం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.