'యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది'
HNK: యువత చిత్తశుద్ధితో లక్ష్యాన్ని చేరుకోవాలని, యువతపైనే దేశం భవిష్యత్ ఆధారపడి ఉందని ధర్మసాగర్ ఎస్సై దిలీప్, ఎంపీడీవో అనిల్ కుమార్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం ధర్మసాగర్, వేలేర్ బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ లో గెలుపొందిన విజేతలకు వారు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.