నేటి నుంచి మూడో దశ నామినేషన్లు ప్రారంభం

నేటి నుంచి మూడో దశ నామినేషన్లు ప్రారంభం

GWDL: గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో దశకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ దశలో 5 మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో మొత్తం 700 వార్డులకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.మూడో దశలో మానవపాడు,అలంపూర్,ఎర్రవల్లి,ఇటిక్యాల,ఉండవెల్లి మండలాలు ఉన్నాయి.