వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో ఇవాళ సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 8,010 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 21,300 ధర పలకగా... వండర్ హాట్ (WH) మిర్చి రూ. 30 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ. 21,600, ఎల్లో మిర్చి రూ. 21వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.