రేపు మండలంలో పర్యటించనున్న మంత్రి  

రేపు మండలంలో పర్యటించనున్న మంత్రి  

MBNR: పాన్‌గల్ మండలంలో మంగళవారం రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవికుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఐకేపీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మాధవరావుపల్లిలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం చేసి, మాధవరావుపల్లి- శాఖపూర్- కదిరపాడు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.