కాల్వబుగ్గ ఆలయ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్
కర్నూలు జిల్లా కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరం ఆలయంలో జరిగిన చోరీ కేసులో మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 10 కిలోల వెండి దొంగిలించగా, 4 కిలోల వెండి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఆధారంగా కేసును ఛేదించినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.