పద్మాక్షమ్మ వారికి పూజలు

HNK: ప్రసిద్ధి చెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో శ్రావణ మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఈరోజు అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అలాగే వివిధ రకాల పూలతో, పూలమాలలతో అమ్మవారిని అలంకరించి, భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. స్థానిక భక్తులు గుట్టపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.