'డీఎంఎఫ్టీ నిధులు ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలి'

MNCL: డీఎంఎఫ్టీ నిధులు సింగరేణి ప్రభావిత ప్రాంతాలలో ఖర్చు చేయాలని హెచ్ఎంఎస్ అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డీఎంఎఫ్టీ నిధులను ఇతర ప్రాంతాలకు తరలించి సింగరేణి ప్రభావిత ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీలు కనీస సౌకర్యాలు కరువై ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.