కార్యకర్తలే నా బలం: మాజీ మంత్రి
KMM: కార్యకర్తలే తన బలమని, ఏ కష్టం వచ్చినా అరగంటలో మీ ముందుకు వస్తానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం వైరాలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంతో సమానంగా వైరా నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. నాయకులు, కార్యకర్తల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.