తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహానికి పూజలు
PDPL: రామగుండం ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్లో జరిపిన తవ్వకాల్లో బయట పడిన పురాతన అమ్మవారి విగ్రహాన్ని నర్రశాలపల్లిలో ప్రతిష్టించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. హిందూ ఐక్య వేదిక నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీపీసీ యజమాన్యం ఆలయాన్ని నిర్మించాలని కోరారు.