లొంగిపోయిన 15 మంది మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో 15 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా ఆ రాష్ట్ర Dy.CM విజయ్శర్మ ఎదుట సరెండర్ అయ్యారు. వారిలో మావోయిస్టు అగ్రనేత వికాస్ కూడా ఉన్నాడు. వీరు తమతో పాటు మూడు AK-47 రైఫిళ్లు, రెండు SLRలు, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, మందు గుండు సామాగ్రిన పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన 15 మందిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం.