బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత
NRML: కడెం మండలం రాణిగూడా పంచాయతీ పరిధిలో గల లక్ష్మీపూర్కు చెందిన ఆత్రం అనిల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న దస్తురాబాద్ మండలం మున్యాల్ గోండుగూడకు చెందిన నాగు స్వామి బాధితుడిని పరామర్శించి ఆర్థిక సాయంగా రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీతారాం గ్రామ పటేల్ సోంజి, జంగు, పాలిక్రావు, గంగారం, తదితరులు ఉన్నారు.