గురు శిష్య బంధానికి నిదర్శనం ఎమ్మెల్యే పాయం

గురు శిష్య బంధానికి నిదర్శనం ఎమ్మెల్యే పాయం

BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తనకు హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా విద్య నేర్పిన ఎర్రాప్రగడ రామమూర్తి ఇంటికి గురువారం సందర్శించారు. తన ఇంటికి వచ్చిన శిష్యుడిని రామమూర్తి పుష్పగుచ్చం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గురువు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.