నేడు మంత్రి సవిత పర్యటన వివరాలు
సత్యసాయి: ధర్మవరంలోని చేనేత క్లస్టర్ని మంత్రి సవిత మంగళవారం 10 గంటలకు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పెనుకొండలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పెనుకొండలోని పార్టీ కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.