పికిల్‌బాల్ ఆడిన కోహ్లీ జంట.. ఫొటో వైరల్

పికిల్‌బాల్ ఆడిన కోహ్లీ జంట.. ఫొటో వైరల్

టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ తన భార్య అనుష్కతో ఫ్యామిలీ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి పికిల్‌బాల్ ఆట ఆడారు. వీరితో దినేష్ కార్తిక్, దీపికా జంటతో పాటు RCB టీం కూడా జతకట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను RCB షేర్ చేస్తూ.. 'పికిల్‌బాల్ ఫీవర్ మా టీమ్‌ను కుదిపేసింది' అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి