మెస్సీ విగ్రహంపై కేఏ పాల్ విమర్శలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఇండియా పర్యటన, పశ్చిమ బెంగాల్లో ఆయనకు విగ్రహం కట్టడంపై మమతా బెనర్జీ సర్కార్పై మండిపడ్డారు. ఎంతో సేవ చేసిన మదర్ థెరీసాకు విగ్రహం కట్టలేదు కానీ, ఓ సాకర్ ప్లేయర్కు ఎందుకు కట్టారంటూ నిలదీశారు.