VIDEO: వేదావతి హగరికి పోటెత్తిన వరద
ATP: కనేకల్ మండలం మాల్యం వద్ద వేదవతి నదికి వరద పోటెత్తింది. మంగళవారం ఒక్కసారిగా నదికి వరద పెరిగింది. నిన్నటి వరకు ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు మాత్రమే రాకపోకలు కొనసాగాయి. నదీ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున, ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, హొన్నూరు ఉరుసు ఉత్సవానికి వెళ్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.