18 మంది మావోయిస్టులు లొంగిపాటు

18 మంది మావోయిస్టులు లొంగిపాటు

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో 18 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'నియాద్ నెలవార్' పథకానికి ఆకర్షితులై వీరంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్లు తెలిపారు. వీరిలో నలుగురు మావోయిస్టులు బెటాలియన్ నెంబర్ 1తో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిగిలిన వారు కూడా లొంగిపోవాలని ఎస్పీ కోరారు.