తాగునీటి చలివేంద్రాల ప్రారంభం
KRNL: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎమ్మిగనూరులో తాగునీటి సౌకర్యం కల్పించేందుకు MLA జయనాగేశ్వర రెడ్డి పలు ప్రాంతాల్లో చలివేంద్రాలను ప్రారంభించారు. వీవర్స్ కాలనీ పెద్ద పార్క్ సమీపంలో, గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు డీహైడ్రేషన్ సమస్యలకు గురికాకుండా ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.