హనుమాన్ ఆలయంలో సీపీ ప్రత్యేక పూజలు

NZB: జిల్లా సీపీ సాయి చైతన్య కంఠేశ్వర్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసంలో చివరి శనివారం కావడంతో నీలకంఠేశ్వర ఆలయంలో వెలసిన ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకున్నారు. తెల్లవారుజాముననే ఆలయానికి చేరుకున్న పోలీస్ కమిషనర్కు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అభిషేకం, అర్చనలు చేశారు.