వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా.!
వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో గురువారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,320 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.16,000 ధర పలకగా వండర్ హాట్(WH) మిర్చి రూ.19,000పలికింది. తేజ మిర్చి ధర రూ.14,400 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.