కాంగ్రెస్లో చేరిన BJP కౌన్సిలర్
MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధి బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అమిస్తాపూర్ 7వ వార్డుకు చెందిన బీజేపీ కౌన్సిలర్ హేమలత, సీనియర్ నాయకులు నర్సింహులు, ప్రవీణ్తో సహా పలువురు కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.