నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు

MDK: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును ఈనెల 18 వరకు పొడిగించడం జరిగిందని జిల్లా విద్యాధికారి రాధాక్రిష్ణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్థులు https://bse.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి నెలకు రూ. 1000 చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందిస్తారని పేర్కొన్నారు.