పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VZM: భోగాపురం మండలం రెడ్డి కంచేరు బీసీ కాలనీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఆమె స్వయంగా పింఛన్లు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు.