అనంతపురంలో డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు
ATP: జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ కేఫ్లలో ఆదివారం రాత్రి డాగ్ స్క్వాడ్ బృందాలతో సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనుమానాస్పద వ్యక్తులు, నిషిద్ధ పదార్థాల నిల్వపై ప్రత్యేక దృష్టి సారించి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.