విజయవాడలో క్వాంటం హార్డ్‌వేర్ తయారీ కేంద్రం

విజయవాడలో క్వాంటం హార్డ్‌వేర్ తయారీ కేంద్రం

ఎన్టీఆర్: విజయవాడ మేధా టవర్స్‌లో దేశంలోనే మొదటి క్వాంటం హార్డ్‌వేర్ టెస్ట్ బెడ్ల తయారీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14న సీఎం చంద్రబాబు ఆ కార్యకలాపాలను ప్రారంభించనుండగా.. ఈ క్వాంటం కంప్యూటర్‌ను క్యుబిటెక్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. రానున్న రోజులలో క్వాంటం హార్డ్‌వేర్, పరిశోధనలకు ఈ టెస్ట్ బెడ్లు విస్తృతంగా ఉపయోగించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.