కసాపురం ఆలయంపై దుష్ప్రచారం.. ప్రభుత్వం కీలక ప్రకటన

కసాపురం ఆలయంపై దుష్ప్రచారం.. ప్రభుత్వం కీలక ప్రకటన

ATP: గుంతకల్లు మండలం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగమ సలహాదారులు, వైదిక కమిటీ సూచనల మేరకు పాత ఆలయాన్ని తొలగించి, నూతన నిర్మాణ పనులు చేపట్టారని పేర్కొంది. తప్పుడు వీడియోలతో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.