ఏజెన్సీలో తీరని దాహం.. అందని శుద్ధ జలం
ADB: ఉట్నూర్ ITDAకు చేరువలో ఉన్న గిరిజన గ్రామాలు నేటికీ రక్షిత తాగునీటికి దూరంగా ఉన్నాయి. ప్రతి ఇంటికీ భగీరథ నీరు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా బావులు, చేతిపంపుల నీటినే ఆశ్రయిస్తున్నారు. కలుషిత నీటితో అనారోగ్య పాలవుతున్నామని, ప్రతి గ్రామంలో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏజెన్సీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.