రాహుల్ గాంధీని కలిసిన జిల్లా కాంగ్రెస్ నేత
అనంతపురం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎండీ.ఇమామ్ వికారాబాద్లో పది రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇమామ్కు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, ప్రజలతో మమేకం కావాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు.