చేనేతల దీక్షకు మద్దతు

చేనేతల దీక్షకు మద్దతు

GNTR: మంగళగిరిలో చేనేతలు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ దీక్షకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు మద్దతు పలికారు. అలాగే మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు కూడా పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.