24 గంటల్లో దుబాయ్పై మరో దాడి
దుబాయ్లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండోసారి దాడి జరగడం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని దుబాయ్ మీడియా వెల్లడించింది. భవనం మాత్రమే దెబ్బతిందని తెలిపింది. శుక్రవారం కూడా దుబాయ్లోని ఓ భవనంపై డ్రోన్ దాడి జరిగినట్లు వార్తలొచ్చాయి.