VIDEO: తిరుచానూరులో వైభవంగా పంచమి తీర్థం
TPT: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం పంచమి తీర్థం జరిగింది. కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈవో వీరబ్రహ్మం, తదితరులు హాజరయ్యారు. పూజల అనంతరం అందరూ కలిసి పుణ్యస్నానాలు చేశారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చి పద్మపుష్కరిణిలో స్నానమాచరించారు.