వాహనదారులు నిబంధనలు పాటించాలి: ఎస్సై

వాహనదారులు నిబంధనలు పాటించాలి: ఎస్సై

NDL: ప్రధాన రహదారుల్లో ప్రయాణించే సమయంలో వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సంజామల ఎస్సై రమణయ్య హెచ్చరించారు. శనివారం మండలంలోని నొస్సం సమీపంలో ఆయన వాహనాల తనిఖీ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డ్రైవర్ లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.