ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి: మాజీ ఎమ్మెల్యే

ఆర్టిజన్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి: మాజీ ఎమ్మెల్యే

NLG: విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న పోరాటంలో భాగంగా గురువారం నల్లగొండ విద్యుత్ డివిజనల్‌ కార్యాలయం వద్ద వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వారికి సంఘీ భావంగా ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్నారు.