దేవుడితో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారు: సజ్జల
AP: తిరుమల నెయ్యి అంశంలో చంద్రబాబు పెద్ద స్కామ్కు పాల్పడ్డారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. దేవుడి దగ్గర కూడా చంద్రబాబు వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నెయ్యి అంశం గురించి మాట్లాడినప్పటి నుంచి రేట్లు పెంచుతూ వచ్చారన్నారు. తాము లడ్డూ వ్యవహారంపై చర్చించకుంటే.. కిలో నెయ్యి రూ.1000 చేసేవారని దుయ్యబట్టారు.