ఈషా సింగ్‌ను అభినందించిన అదనపు డీజీపీ

ఈషా సింగ్‌ను అభినందించిన అదనపు డీజీపీ

HYD: ఉమెన్ షూటర్ ఈషా సింగ్ డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేష్ భగవత్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. కైరోలో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2 రజతాలతో మెరిసిన ఈషాను అధికారులు అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి 700 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ పోటీలో ఆమె సాధించిన విజయం పట్ల భగవత్ శుభాకాంక్షలు తెలియజేశారు.