వరంగల్ లో చిట్టి మోసం.. 2 కోట్లతో వ్యక్తి పరార్

వరంగల్ లో చిట్టి మోసం.. 2 కోట్లతో వ్యక్తి పరార్

WGL: పట్టణ కేంద్రంలో దారుణ మోసం చోటుచేసుకుంది. కాశీకుంటకు చెందిన వెంకటయ్య కరుణ పరపతి సంఘం ఏర్పాటు చేసి 600 మంది సభ్యుల నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు. లోన్‌లు ఇవ్వకుండా ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయడంతో సభ్యులు బుధవారం వెంకటయ్య ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.