గ్యాస్ కొరత.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని సూచించింది. ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని ఆదేశించింది. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలిని పేర్కొంది. స్టోర్లలో ఉన్న గ్యాస్ నిల్వల వివరాలు సేకరించాలని, దానికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపింది.