CK దిన్నె పూర్వ MROపై విచారణ

CK దిన్నె పూర్వ MROపై విచారణ

KDP: చింతకొమ్మదిన్నె మండలం మామిళ్లపల్లె భూములను అక్రమంగా వెబ్ ల్యాండ్‌లో నమోదు చేశారనే ఆరోపణలపై అప్పటి MRO మహేశ్వరరెడ్డిపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నెల్లూరు GGHలో సూపరింటెండెంట్‌గా ఉన్న అతనిపై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు.