ఏలూరు నూతన జెడ్పీ సీఈవో బాధ్యతలు స్వీకరణ
ఏలూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన పి. జగదాంబ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ పి. జగదాంబకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.