రేపు గంగాధరనెల్లూరులో పీజీఆర్ఎస్
CTR: గంగాధరనెల్లూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద రేపు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా అధికారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్గౌడ్ తెలిపారు. దీనిని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.