పదేపదే దొంగతనాలు.. ముగ్గురిపై పీడీ చట్టం
KDP: పదేపదే దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిపై పోలీసులు పీడీ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. కావటి అరుణపై 16 కేసులు, తొండ పోసమ్మపై 27 కేసులు, తొండ పోతురాజుపై 56 కేసులు నమోదయ్యాయి. పలుమార్లు అరెస్ట్ అయ్యి, బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతుండటంతో ఈ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు.