నేడు విద్యుత్ సరఫరా కు అంతరాయం..!
SKLM: సోంపేట 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ మరమ్మత్తు పనులు కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పలాస ఈఈ యజ్ఞేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జింకిభద్ర, బెంకిలి పంచాయతీల పరిధిలోని గ్రామాలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని కోరారు.