వావిళ్లపల్లిలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం
యాదాద్రి జిల్లా నారాయణపురంలోని వావిళ్లపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఇందులో మౌనికకు రూ.60,000, సైదులుకు రూ.42,000, మల్లేష్కు రూ.30,000, సాయమ్మ రూ.17,000, నాగమ్మకు రూ.16,500, వెంకటాచారికు రూ.9,000లు సర్పంచ్ అయితరాజు సరళ చంద్రయ్య అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.